రామభద్రపురంలో వంద రోజుల పాలనపై ఇంటింట ప్రచారం

85చూసినవారు
రామభద్రపురంలో వంద రోజుల పాలనపై ఇంటింట ప్రచారం
గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రవేశపెట్టిన గ్రామ సందర్శనను వినియోగించుకోవాలని రామభద్రపురం మండల స్పెషలాఫీసర్ గోవిందరావు సూచించారు.
మండల పరిధిలోని ముచ్చర్లవలస గ్రామంలో శుక్రవారం గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో వంద రోజుల పరిపాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజాప్రభుత్వంగా రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్