గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రాత్రి ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించి, ఉపవాసాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యి మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, చిన్నపిల్లలు పాల్గొనటం విశేషం.