కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కురుపాం ధూళికేశ్వర ఆలయం నుంచి సాయిరాం గుడి వరకు శుక్రవారం భారీగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగసభ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.