మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామానికి చెందిన ధనుకొండ శ్రీనిధి తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. ఈమేరకు ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఆమె తల్లిదండ్రులు ధనుకొండ శ్రీనివాసరావు, సుశీల ఇద్దరూ ఉపాధ్యాయులే. శ్రీనివాసరావు నెల్లిమర్ల మండలం సారిపల్లి జెడ్పి హైస్కూలులో పనిచేస్తున్నారు. వీరు ప్రస్తుతం విజయనగరంలోని పూల్బాగ్ కాలనీలో నివాసముంటున్నారు.