సమాజానికి ఉత్తమ పౌరులను అందించి, తద్వారా సమాజానికి సేవ చేసే ఉద్దేశ్యంతో శ్రీ సరస్వతీ శిశు మందిరాలు దేశ వ్యాప్తంగా కృషి చేస్తున్నాయని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులు కే. వీ. సత్యన్నారాయణ అన్నారు. గురువారం సాలూరు శ్రీ సరస్వతీ శిశు మందిర్ వారు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన కావించారు.