పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల

64చూసినవారు
వేపాడ మండలం పాటూరు, వీలుపర్తిలో బుధవారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. అనంతరం 30 లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపొందించిన కార్యాచరణలో భాగంగా చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్