ఎస్ కోట: పల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

54చూసినవారు
ఎస్ కోట: పల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎస్ కోట నుండి విశాఖపట్నం కు అదనంగా ప్రారంభించిన పల్లె వెలుగు బస్సు సర్వీసును ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. విద్యా, వ్యాపార, ఉద్యోగ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్న వారికి ఈ బస్సు సర్వీసు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ కె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్