జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముద్రగడ పద్మనాభం మరోసారి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కు ఎందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. ‘అధికారం కోసం 2014లో చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెట్టి మోసగించారు. రిజర్వేషన్లపై నేను ప్రశ్నిస్తే.. రాజకీయంగా నన్ను అణగదొక్కడమే కాకుండా అవమానించారు. అప్పుడు చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదు.’ అని అన్నారు.