మణిపూర్‌లో అరుదైన ఘటన.. తొలిసారి హత్తుకున్న మైతీ, కుకీలు (వీడియో)

63చూసినవారు
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో అరుదైన సంఘటన జరిగింది. మైతీ, కుకీ వర్గాలకు చెందిన సభ్యులు తొలిసారి ఒకరినొకరు హత్తుకున్నారు. గతంలో పొరపాటున కుకీ ప్రాంతంలోకి ప్రవేశించిన మైతీ యవకులు ఇద్దరిని తాజాగా ప్రాణాలతో విడిచిపెట్టారు. వారిద్దరినీ కుకీ సివిల్ సొసైటీ గ్రూప్ గురువారం పోలీసులకు అప్పగించింది. వారు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర అధికారులకు సీఎం బీరెన్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్