జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించని షాకిచ్చారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 24న పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈసీకి సమర్పించిన అఫిడవిట్ చర్చనీయాంశమైంది. ఇన్ని రోజులు పవన్-రేణుదేశాయ్లకు పుట్టిన పిల్లలు అకీరా నందన్, ఆద్య కొణిదెల వారసులని అందరూ అనుకున్నారు. కానీ అఫిడవిట్లో అకీరానందన్ దేశాయ్, ఆద్య దేశాయ్గా వారి పేర్లు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.