పెన్షన్ రూ.6,500లే ఇస్తున్నారు: మహిళలు (వీడియో)

84చూసినవారు
చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టింది. రూ.7 వేల పెన్షన్ అందిస్తుండగా.. కొందరు అధికారులు దోపిడీకి పాల్పడుతున్నట్లు సమాచారం. రూ.7 వేలు ఇవ్వట్లేదని, రూ.500 కట్ చేసుకొని రూ.6,500లే ఇస్తున్నారని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మీకు రూ.7 వేలు ఇస్తుందని, రూ.500 అడుగుతున్నామని, మీకు ఇష్టముంటే ఇవ్వమని అధికారులు చెబుతూనే డబ్బులు కట్ చేసుకుంటున్నారని ఓ మహిళ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్