దర్శి: విద్యుత్ చార్జీలను రద్దు చేయాలి

70చూసినవారు
దర్శి: విద్యుత్ చార్జీలను రద్దు చేయాలి
విద్యుత్ వినియోగదారులపై మోపిన రూ. 8, 113 కోట్ల విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని దర్శి సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. దర్శి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఇంధనం చార్జీలు, ట్రూ అప్ పేరిట వినియోగదారులపై మోపిన భారాన్ని తగ్గించాలంటూ శుక్రవారం విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ కార్యదర్శి రంగారావు, సిపిఎం నేతలు పిచ్చయ్య, నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్