ప్రకాశం జిల్లా కంభం మండల పరిసర ప్రాంతాలలో పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా అత్యధికంగా పత్తి పంట రైతులు వివరంగా నష్టపోయినట్లుగా మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తుఫాన్ కారణంగా మండలంలో పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని పంట నష్టం పై అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.