జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు లేదు: మంత్రి స్వామి

80చూసినవారు
వైద్య ఆరోగ్యశాఖ పై మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రిమ్స్ ను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రిమ్స్ లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్