అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు

81చూసినవారు
ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై పంచాయతీ అధికారులు ఉక్కు పాదం మోపారు. టంగుటూరు పట్టణంలోని ఆర్. అండ్. బి రోడ్ లో ఆక్రమణలకు పాల్పడిన వారిపై పంచాయతీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రోడ్డును ఆక్రమిస్తూ కట్టిన అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో శుక్రవారం అధికారులు కూల్చివేశారు. ముందుగానే అధికారులు మార్కింగ్ వేసి స్థానికులకు నోటీసులు ఇచ్చారు. గొడవలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్