చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు నగరం తో పాటు కొత్తపట్నం ప్రాంతాల్లోని ప్రైవేటు అతిథి గృహాల్లో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. అతిథి గృహానికి వచ్చే వారి పూర్తి వివరాలు నమోదు చేసే రిజిస్టర్, గదులు, సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారి వివరాలను రిజిస్టర్ లో తప్పక నమోదు చేయాలని సూచించారు.