అధికారులకు కార్యకర్తలు సహకరించాలి

2224చూసినవారు
గిద్దలూరు టిడిపి ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం కార్యకర్తలకు నాయకులకు ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 4వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పురస్కరించుకొని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటిస్తూ పోలీసులకు ఎన్నికల అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు పాల్పడకుండా కార్యకర్తలు ప్రశాంతంగా ఉంటూ అధికారులకు సహకరించాలని అశోక్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్