దర్శి: గ్రామాల అభివృద్ధికి కృషి: గొట్టిపాటి

51చూసినవారు
దర్శి: గ్రామాల అభివృద్ధికి కృషి: గొట్టిపాటి
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని దర్శి టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముండ్లమూరు మండలం శంకరపురం గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమం సందర్భంగా నూతనంగా చేపడుతున్న మురుగు కాలువల నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మండల మాజీ ఎంపీపీ మండలపు వెంకట్రావు, మాజీ మండల జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్