గిద్దలూరు: ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే

57చూసినవారు
గిద్దలూరు: ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం స్థానిక ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమావేశమయ్యారు. గిద్దలూరు నుంచి రాచర్లకు వెళ్లే సగిలేరు సప్లై ఛానల్ కాలువ గురించి వారితో చర్చించారు. నీటి వృధా కాకుండా చెరువులకు నీరు అందించే కాలువలను పరిశీలించి అవసరమైతే వాటికి మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలోని సమస్యలపై వారిని ఎమ్మెల్యే ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్