గిద్దలూరు: సమస్యలు పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే

85చూసినవారు
గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బుధవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. వివేకానంద కాలనీలో డ్రైనేజీ కాలువల వల్ల ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. చిన్న, పెద్ద సమస్య అనే తేడా లేకుండా సమస్యపై దృష్టి సారిస్తామని ఇంకా 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు తాను అప్రమత్తంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్