కంభం: గుండ్లకమ్మను పరిశీలించిన అధికారులు

68చూసినవారు
కంభం: గుండ్లకమ్మను పరిశీలించిన అధికారులు
కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగును ఎస్సై నరసింహారావు, తహశీల్దార్ కిరణ్ మంగళవారం పరిశీలించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. వాగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజలు, పిల్లలు అటువైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు గ్రామ ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్