గిద్దలూరు లో ఘనంగా మొహరం పండుగ వేడుకలు

589చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో బుధవారం మొహరం పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం పెద్ద సరిగేసు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కుల మతాలకు అతీతంగా భక్తులు పీర్ల చావిడిని దర్శించుకుని మొక్కులను చెల్లించారు. అనంతరం పీర్లను ఎత్తుకున్న భక్తులు నృత్యాలు చేశారు. మొహరం పండగ వేడుకల సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్