మార్కాపురంలో వడదెబ్బతో వ్యక్తి మృతి

2964చూసినవారు
మార్కాపురంలో వడదెబ్బతో వ్యక్తి మృతి
కాపురం మండలం రాయవరం గ్రామంలో మసాలా బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి ఎండ తీవ్రతతో శనివారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు శ్రీనివాసరెడ్డిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వారు గుర్తించారు. గత వారం రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో శ్రీనివాసరెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్