ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దామచర్ల జనార్ధన్
ఒంగోలు నగరం 23వ డివిజన్ లో శుక్రవారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం జనార్దన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.