
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దర్మరణం
పల్నాడు జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజపాలెం మండలం పెద్దనెమలిపురి గ్రామం వద్ద ట్యాంకర్ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లా, షేక్ నజీమాగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.