ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్

4884చూసినవారు
ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తూ ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై వేటుపడింది. రాచర్ల మండలం అనుమలవీడు జిల్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు నాగేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లుగా డిఈఓ సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు నిబంధనలు అతిక్రమించి అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేసి సస్పెండ్ చేసినట్లుగా డీఈవో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్