నూతన విద్యా సంవత్సరం ప్రారంభంపై ఈ నెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు అన్ని మండలాల ఎంఈవోలు, ఉప విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా డీఈవో సుభద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అజెండా రూపొందించి ఎంఈఓ లకు పంపించామన్నారు.