టీడీపీ తరఫున ఐటీ ఉద్యోగుల ప్రచారం

56చూసినవారు
టీడీపీ తరఫున ఐటీ ఉద్యోగుల ప్రచారం
నవ్యాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు నిరంతర శ్రామికుడిలా పనిచేశారని, ప్రపంచంలోనే ఏపీకి గుర్తింపు వచ్చింది అంటే బాబు చలువేనని తెలుగు ప్రొఫెషనల్ వింగ్ టీం సభ్యులు చెప్పారు. సోమవారం సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెం, గంగవరం, లక్ష్మీపురం గ్రామాల్లో టీడీపీ కూటమికి ఓటువేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్