చీమకుర్తి: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

55చూసినవారు
చీమకుర్తి: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామంలో చోటు చేసుకున్నది. తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తల గొడవ నేపథ్యంలో గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గ్రామస్తులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్