ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘
పుష్ప ది రైజ్’. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ‘
పుష్ప ది రూల్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్త పై తాజాగా చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ముందుగా అనుకున్న తేదికే ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలిపింది. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.