AP: రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ప్రమాదం తప్పింది. కొలిమిగుండ్ల మండలం కలవటాల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.