మలివిడత ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా సీఎం జగన్ రేపు మూడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జరిగే సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ఆయన.. ఆ తర్వాత వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభలో, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.