లోక్సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి , ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి సైతం బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణమూర్తి ఆసుపత్రి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.