ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక: సీఎం చంద్రబాబు

52చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక: సీఎం చంద్రబాబు
మంగళగిరి టీడీపీ ఆఫీసులో ప్రజలు, కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ఎంతో మంది సమస్యలను తీర్చాలని చంద్రబాబును సాయం కోరుతున్నారు. 'ప్రజల వినతులు చూస్తుంటే ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తుంది. గత ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం వల్లే ఇన్ని సమస్యలు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని' చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్