దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధాలున్న నలుగురు నిందితులకు గుజరాత్లోని గోద్రా కోర్టు నాలుగు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. గోద్రాలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలకు పాల్పడిన ఐదుగురిని ఈ నెల 5వ తేదీన గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వారికి కస్టడీ విధించాలని సీబీఐ కోరగా కోర్టు అందుకు అంగీకరించింది.