వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన పెగడ రమణయ్య, నరసింహారావులకు చెందిన గేదెలు పొలాల్లో మేతకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాయి. నష్ట పరిహారం క్రింద, రైతులిద్దరికీ విద్యుత్ శాఖ తరపున రూ. 1. 55 మంజూరయ్యాయి. గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు చేతుల మీదుగా రైతులకు నష్టపరిహారం చెక్కులను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.