అరుణాచలం గిరి ప్రదర్శనకు కందుకూరు డిపో నుంచి ఈనెల 17వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదివారం మాట్లాడుతూ. రూ. 2100 టికెట్ పై కానిపాకం, శివకంచి, విష్ణుకంచి గోల్డెన్ టెంపుల్ తదితర పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ఉంటుందని తెలిపారు. వివరాల కోసం కందుకూరు డిపో అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.