కావలి పట్టణంలో వైసీపీ కి మరో షాక్ తగిలింది. కావలి పట్టణం 2వ వార్డుకు చెందిన నర్రా భాస్కర్ యాదవ్ వైసిపిని వీడి టిడిపిలో చేరారు. శుక్రవారం కావలి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన టిడిపిలో చేరారు. ఆయనకు కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.