చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ

568చూసినవారు
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో రుద్రకోట చెక్ పోస్ట్, కావలి టోల్ ప్లాజాలను శనివారం జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తనిఖీ చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 18 చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, అక్రమ రవాణా అరికట్టుటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్