నెల్లూరులో శుక్రవారం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్ర దిగ్విజయంగా జరిగిన విషయం విధితమే. అనంతరం బాలకృష్ణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసంలో రాత్రి బస చేశారు. శనివారం ఉదయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ, బీదా రవి చంద్రతో ఆయన భేటీ అయ్యారు.