మహారాష్ట్రలోని షోలాపూర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలికకు అనురాగ్ మహేష్ మోర్ అనే యువకుడు కాలేజీలో సీనియర్. ఏడాదిగా వారికి పరిచయం ఉంది. వేరే అబ్బాయిలతో ఆమెకు సంబంధం ఉందని అనురాగ్ అనుమానించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె సంబంధం తెంచుకుంది. దీంతో ఆమె ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమె తల్లిదండ్రులకు సైతం పంపించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.