తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

74చూసినవారు
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోందని తుంగభద్ర జలాశయం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు వస్తుండటంతో జలాశయానికి గురువారం 37,489 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 83.25 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. వివిధ కాల్వలకు 9,488 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్