గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 38 మంది మృతి

71చూసినవారు
ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. గురువారం గాజాపై దాడి చేసి 18 మందిని హతమార్చిన ఇజ్రాయెల్‌.. శుక్రవారం సైతం దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ దాడుల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రొట్టెల కోసం ఓ బేకరీ ఎదుట బారులు తీరి ఉన్న జనంపై ఇజ్రాయెల్‌ బాంబులతో విరుచుకుపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్