కొడుకు మృతితో మనస్థాపం చెంది తండ్రి ఆత్మహత్య

71చూసినవారు
కొడుకు మృతితో మనస్థాపం చెంది తండ్రి ఆత్మహత్య
ధర్మవరంలోని ప్రియాంక నగర్ కు చెందిన వ్యాపారి రజనీ బాబు(50) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు. రజనీ బాబు భార్య రామాంజనమ్మ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజనీబాబు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. రజనీబాబు కుమారుడు నిశాంత్ ఏడాది కిందట మృతిచెందాడు. కొడుకు మృతి జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్