రైతులకు సబ్సిడీ ఉలవలు పంపిణీ చేసిన ఏవో

84చూసినవారు
రైతులకు సబ్సిడీ ఉలవలు పంపిణీ చేసిన ఏవో
ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో సోమవారం ధర్మవరం మండల అగ్రికల్చరల్ అధికారి ముస్తఫా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉలవలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఉలవలు పంపిణీ చేస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్