కళ్యాణదుర్గం: రైతులు మోసపోకండి: పిడి రఘునాథ్ రెడ్డి

74చూసినవారు
కళ్యాణదుర్గం: రైతులు మోసపోకండి: పిడి రఘునాథ్ రెడ్డి
కళ్యాణదుర్గం వ్యవసాయ డివిజన్ లో డ్రిప్ పరికరాల కోసం 6, 900 హెక్టార్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ డ్రిప్ పరికరాల కోసం రైతులు మధ్యవర్తులు, డీలర్లు, ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు నిబంధనల మేరకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలను మంజూరు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్