శ్రీ రామిరెడ్డి తాగునీటి పైప్ లైన్ పగిలి వృధాగా పోయిన నీరు

72చూసినవారు
కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామం వద్ద గురువారం శ్రీ రామిరెడ్డి నీటి పథకానికి సంబంధించిన ప్రధాన పైపులు లీకేజీ కావడంతో తాగునీరు కాలువను తలపించేలా వృథాగా పోయింది. పంటపొలాల్లోకి ఆ నీరు వెళ్లడంతో వేరుశనగ పంట పూర్తిగా నాశనం అవుతుందని రైతు శ్రీ రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులకు ఎన్ని సార్లు సమాచారం అందించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే తాగునీటి పైపులకు మరమ్మత్తులు చేయాలని రైతులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్