శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామంలో సోమవరం వైసీపీ సీనియర్ నాయకుడు ఆనంద రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప రాబోయే ఎన్నికల్లో తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మళ్లీ మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.