వరద బాధితుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో గుప్పెడు ధాన్యం సేకరణ

78చూసినవారు
వరద బాధితుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో గుప్పెడు ధాన్యం సేకరణ
పెనుకొండ నగర పంచాయతీలో ఆదివారం పెనుకొండ మండల బిజెపి సభ్యత్వ నమోదు బాధ్యుడు డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో, విజయవాడ వరద భాధితులకు సహాయార్థం బిజెపి పిలుపు మేరకు ఇంటింటికి తిరుగుతూ గుప్పెడు ధాన్యం సేకరణ చేశారు. ఈ సందర్బంగా జిఐసి కాలనీ, వజ్రాల పేట, తదితర ప్రాంతాలలో బిజెపి నాయకులతో కలసి ఇంటింటికి వెళ్లి దాతలు ఇచ్చిన వస్తువులను సేకరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవి, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్