రైతులకు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ

69చూసినవారు
రైతులకు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ
శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఏపీఐఐసి వారిచే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణం కొరకు భూములు ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను ఆదివారం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని భువన విజయం సమావేశం భవనంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, ఏపీఐఐసి, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్