సోమందేపల్లి: తెగిన హంద్రీనీవా కాలువ గట్టు...

74చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని హంద్రీనీవా కాలువ గట్టు మంగళవారం తెగింది. దీంతో మంచేపల్లి, పందిపర్తి చెరువులకు హంద్రీనీవా కాలువ నీరు చేరుతోంది. ఒక వైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, వాగులు, వంకలు పొర్లు తున్నాయి. మరో వైపు హంద్రీనీవా కాలువ గట్టు తెగడంతో మంచేపల్లి, పందిపర్తి చెరువులకు నీరు ప్రవహిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి తెగిన హంద్రీనీవా కాలువ గట్టుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్